పోలింగ్‌ కేంద్రాల్లోకి ఫోన్​కు నో ఎంట్రీ.. డిపాజిట్ సౌకర్యం లేకపోవడంతో వెనుదిరుగుతున్న ఓటర్లు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటింగ్ కేంద్రాలకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం పూట రద్దీ కాస్త తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు సామాన్యులు కూడా ఉదయం పూటనే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు.

ఈ క్రమంలో కొంతమంది తమ మొబైల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే కేంద్రంలోనికి ఫోన్​ను ఎన్నికల అధికారులు అనుమతించడం లేదు. మరోవైపు ఫోన్​ను డిపాజిట్ చేసేందుకు వెసులుబాటు కూడా కల్పించకపోవడంతో దాన్ని ఎక్కడ భద్రపరచాలో అర్థంగాక ఓటు వేయకుండానే పలువురు ఓటర్లు వెనుదిరుగుతున్నారు. ఇది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువగా జరుగుతోంది. అయితే అవగాహన లేక మొబైల్ వెంట తీసుకొచ్చామని.. పోలింగ్‌ కేంద్రాల్లో ఫోన్‌ డిపాజిట్‌ చేసే వెసులుబాటు కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు. దీనిపై ప్రస్తుతం అధికారులు స్పందించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version