నేడు రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ ‘బూత్ లెవెల్ ఏజెంట్స్’ సమావేశం

-

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులను పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో కనీసం 12 స్థానాలకు తగ్గకుండా లోక్సభ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొంటారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కీలకమైన బూత్‌స్థాయి ఏజెంట్లకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారు.

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించిన పార్టీ బలమైన నాయకుల కోసం వేట కొనసాగిస్తోంది. అందుబాటులో ఉన్న నాయకులతోపాటు ఇతర పార్టీల నుంచి ఎవరైనా బలమైన నేతలు పార్టీలో చేరేట్లుంటే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఒక్క ఎమ్మెల్యే  ప్రాతినిధ్యం లేని హైదరాబాద్‌, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి వంటి లోక్‌సభ నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యచరణ సిద్ధం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version