గద్దర్​కు రాజకీయ, సినీ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు

-

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజాగాయకుడు గద్దర్‌ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వివిధ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, కళాకారాలు, వివిధ వర్గాల ప్రజలు అంజలి ఘటించారు. ఇవాళ ఉదయం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ శానససభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గద్దర్​ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు సినీ ప్రముఖులు మంచు మోహన్‌బాబు, మనోజ్‌, కొణిదెల నాగబాబు, నిహారిక, అలీ తదితరులు గద్దర్​కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అణగారిన వర్గాలు, తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని పలువురు మంత్రులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version