ఆగ‌స్టు మొద‌టి వారంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు..!

-

గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆగ‌స్టు మొద‌టి వారంలో గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉందని చెప్పింది. ఈ నేప‌థ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలను విడుద‌ల చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నట్లు తెలిపింది. వ‌చ్చే వారం ఫైన‌ల్ కీ ని కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.

ఈ ఏడాది జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ప్రాథ‌మిక కీని కూడా కొద్ది రోజుల క్రితం విడుద‌ల చేశారు. ప్రాథ‌మిక కీ పై వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను నిపుణుల క‌మిటీకి టీఎస్‌పీఎస్సీ పంపింది. ఈ క్ర‌మంలో సోమ లేదా మంగ‌ళ‌వారాల్లో ఫైన‌ల్ కీని విడుద‌ల చేసే అవకాశం ఉంది. తుది కీని విడుద‌ల చేసిన అనంత‌రం ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల ఓఎంఆర్ షీట్ల‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్ర‌క‌టించిన త‌ర్వాత 1:50 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. మొత్తంగా 25,150 మందిని టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌కు ఎంపిక చేయ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version