సీఎం ప్రెస్ మీట్ సీడీలు ఎక్కడివి.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పిటిషనర్లకు హైకోర్టు ప్రశ్న

-

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మధ్యంతర పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. సీఎం మీడియా సమావేశం సీడీలు ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది.

65బీ ఎవిడెన్స్ యాక్ట్  కింద సర్టిఫికెట్ లేదని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. సర్టిఫికెట్ సమర్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి కోర్టు సమయమిచ్చింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదికి సాయంత్రం 4 గంటల వరకు ధర్మాసనం సమయం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version