తెలంగాణలో రాగల మూడ్రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

-

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాగల మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని వెల్లడించింది. వచ్చే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు, హైదరాబాద్‌ సమీప జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదవనున్నట్టు పేర్కొంది.

తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతూ.. ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version