తెలంగాణలో విషాదం..టీకా వికటించి శిశువు మృతి

-

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది..టీకా వికటించి శిశువు మృతి చెందింది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్ళ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్ళ గ్రామానికి చెందిన లలిత – రమేష్ దంపతుల 45 రోజుల వయసుగల కూతురుకు నేరెళ్ళ పీహెచ్సీలో టీకా వేయించారు.

The 45-day-old daughter of Lalitha and Ramesh of Nerella village of Rajannasirisilla district was vaccinated at Nerella PHC

అయితే ఇంటికి వెళ్ళాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకరాగా అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పాప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు కుటుంబసభ్యులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news