మేడిగడ్డ కుంగుబాటు పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య..!

-

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో ఆయనను నరికి చంపారు. ఈయన పై గతంలో భూతగాదాల విషయమై పలు కేసులు నమోదు అయ్యాయి. హత్యకు పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటన పై ఇంకా ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు.

రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెళ్లి సరళ భర్త.. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వవార్డు నుంచి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా గెలుపొందారు. కొద్ది నెలల తరువాత నాగవెళ్లి సరళను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనం పై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో నలుగురు నుంచి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాంపులు ధరించి ఆయనను చుట్టుముట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version