BREAKING: రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల

-

BREAKING: తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల అయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలోనే రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం సుమారు 7 లక్షల మంది రైతులకు 6 వేల 191 కోట్ల నిధులు కేటాయింపులు చేశారు.

Phased loan waiver from July 15

రెండో విడుతలో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 17 మంది రైతులకు చెక్కులను అందజేశారు. రైతు రుణమాఫీ మొదటి విడతలో 11,34,412 రైతులకు రుణమాఫీ అయింది. దీని కోసం 6034.96 కోట్లు ఖర్చు చేసింది రేవంత్‌ సర్కార్‌. రెండవ విడతలో 6,40,223 మంది రైతులకు రుణమాఫీ అయింది. దీని కోసం 6190.01 కోట్లు ఖర్చు చేసింది రేవంత్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version