వరంగల్ లో టిఆర్ఎస్ – బిజెపి ఫ్లెక్సీల రగడ

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సతీ సమేతంగా హైదరాబాదులో ల్యాండ్ కాబోతున్నారు నడ్డా.

బిజెపి బహిరంగ సభ ఉండడంతో వరంగల్ లో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఓవైపు వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్ – బిజెపిల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్ళీ మొదలైంది. ఓవైపు బిజెపి కార్యకర్తలు బండి సంజయ్ కి ఆహ్వానం పలుకుతూ.. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బిజెపి కార్యకర్తలు ఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీలు చించి వేసింది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలేనంటూ.. బిజెపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వరంగల్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version