అమిత్ షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Union Home Minister Amit Shah and Telangana CM Revanth Reddy participated in the meeting

సీఎం రేవంత్‌ తో పాటు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ కూడా ఉన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మంత్రులు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు.వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సాయాన్ని అందిస్తున్న మరో అయిదు కేంద్ర మంత్రిత్వ శాఖల మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version