BREAKING : కిషన్ రెడ్డికి అస్వస్థత..ఢిల్లీలో చికిత్స

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీ నొప్పితో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చేరాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిన్నటి వరకు బాగానే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో… ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది.


ఇది ఇలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం.. జన్ కీ బాత్ (ప్రజావాణి), దేశ్ కీ బాత్ (దేశ వాణి) గా ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ను పురస్కరించకుని ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో.. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీగారు ప్రస్తావించిన పలు అంశాల ఆధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేశారు. ఆదివారం సాయంత్రం కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ గ్యాలరీని ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version