కేరళ పేలుళ్లపై కేంద్ర మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. కేసు నమోదు

-

ప్రశాంతంగా ఉండే కేరళలో ఆదివారం చోటు చేసుకున్న పేలుళ్లు ఉలిక్కి పాటుకు గురి చేసాయి. ఈ ఘటనను ఉద్దేశించి కేంద్రమంత్రి రాజీవ్ చందశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది. వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చ గొట్టేలా ప్రకటనలు చేశారంటూ ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా ఏజెన్సీ వెల్లడించింది.

ఈ పేలుళ్లపై రాజీవ్ చంద్రశేఖర్ కేరళ సీఎం పినరయి విజయన్ పై విమర్శలు గుప్పించారు. కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడుతున్నాయని.. అయినప్పటికీ కేరళ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యల్లో మతపరమైన అజెండా కనిపిస్తోందని మండిపడ్డారు. ఓ బాధ్యతయుతమైన మంత్రిగా ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న సంస్థలపై కొంచెం అయినా గౌరవం ఉంచాలి. దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది. కానీ వారు మాత్రం కొన్ని వర్గాలే లక్ష్యంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version