కేంద్ర బడ్జెట్ పై స్పందించిన వీహెచ్

-

కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నేత వి.హనుమంతు రావు స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా జరిగాయన్నారు. తెలంగాణలో విభజన హామీలు ఏవీ పూర్తి చేయలేదు. మూసీ ప్రక్షాళన కోసం నిధులు కోరినా కేటాయింపులు జరపలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతాన్ని ప్రదర్శిస్తోంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కి కూడా నిధులు ఇవ్వలేదు.

ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు కూడా నిధులు ఇవ్వం అని ఓ నేత అంటున్నారు. ఇది ఈనాటి పథకం కాదు.. ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న పథకం. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి. గెలిచిన తరువాత అందరినీ సమానంగా చూడాలి. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలపై ఇలాంటి వివక్ష చూపలేదని పేర్కొన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూ మోడీ ఇచ్చే స్లోగన్ కు ఆచరణకు సంబంధం లేదన్నారు హనుమంతురావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version