దేశాన్ని విచ్ఛిన్నం చేయాల‌నే కేసీఆర్‌ స్కెచ్‌ వేశాడు – విజయశాంతి

-

దేశాన్ని విచ్ఛిన్నం చేయాల‌నే కేసీఆర్‌ స్కెచ్‌ వేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. కేసీఆర్‌కు తెలంగాణలో ఉన్న స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోవ‌డానికి టైం ఉండ‌దు కానీ, చిల్ల‌ర రాజ‌కీయాల‌కు మాత్రం స‌మ‌యం ఉంటుందని… నిన్న‌ యువ‌కుల పేరుతో విధ్వంసం సృష్టించారు. ఇందులో టీఆర్ఎస్ గుండాలే ఉన్నారు త‌ప్ప, అమాయ‌క యువ‌త‌కు ఎలాంటి సంబంధం లేదని ఆగ్రహించారు. ఇలా చిల్ల‌ర రాజ‌కీయ‌ల‌తో ప‌బ్బం గ‌డుపుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌కు బాస‌ర‌ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల బాధ‌లు మాత్రం ప‌ట్టవు. ఇప్ప‌టికీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు త‌మ సౌక‌ర్యాల కోసం ఓ యుద్ధ‌మే చేయాల్సి వ‌స్తోందని ఆగ్రహించారు.

అయినా కేసీఆర్ స‌ర్కార్ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్ప‌టికీ అక్క‌డ‌ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఖాళీ వాటర్ బాటిల్స్‌తో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. విద్యార్థుల‌ు మెయిన్ గైట్ వైపు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరీ అడ్డుకుంటున్నరు. మరోవైపు విద్యార్ధులకు సపోర్టుగా వస్తున్న పేరేంట్స్ సహా నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నరు. ఇంకోవైపు విద్యార్ధుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బండి సంజ‌య్ గారినీ అదుపులోకి తీసుకున్నరు. ప్ర‌జాస్యామ్యం అంటే ఇదేనా కేసీఆర్? బాస‌ర విద్యార్థులారా… మీరు అధైర్య ప‌డ‌కండి. మీ స‌మ‌స్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు.

విద్యార్థుల స‌మస్య‌లు తెలుసుకోవ‌డానికి వ‌స్తున్న నాయ‌కుల‌ను అరెస్ట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌సం? ఈ సంఘ‌ట‌న‌లు చూస్తుంటే మ‌నం తెలంగాణ‌లోనే ఉన్నామా? అనే సందేహం క‌లుగుతోంది. కేసీఆర్… దేశాన్ని విచ్ఛిన్నం చేయాల‌నే ఈ చిల్ల‌ర రాజ‌కీయాల‌ను ప‌క్కనపెట్టి… ముందు బాస‌ర విద్యార్థుల‌ స‌మస్య‌ల‌్ని ప‌ట్టించుకో… తెలంగాణ‌ ప్ర‌జ‌లు ఎంతో చైత‌న్యవంతులు. కేసీఆర్ స‌ర్కార్‌కి త‌గిన స‌మ‌యంలో త‌గిన రీతిన వారే బుద్ధి చెప్తరని హెచ్చరించారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version