వేములవాడ బిజెపి అభ్యర్థిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు !

-

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు తరముకస్తున్న నేపథ్యంలో పార్టీలు మారుతున్నారు కీలక నేతలు. ఈ నేపథ్యంలోనే మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు చెన్నమనేని వికాస్ కూడా బిజెపి తీర్థం పుచ్చుకొన్నారు. బిజెపి విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపిన వికాస్… పేదలకు సేవ చేయడానికి రాజకీయాలలోకి వస్తున్నానని ప్రకటించారు.

ఇందులో భాగంగానే వేములవాడ నుంచి హైదరాబాద్కు ర్యాలీగా వెళ్లి పార్టీలో చేరనున్నారు. కాగా వేములవాడ బిజెపి టికెట్ ను వికాస్ రావు ఆశిస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి బిజెపి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన బిజెపిలోకి వెళితే వేములవాడ నియోజకవర్గం లో త్రిముఖ పోరు తప్పదు.

ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చేందుకు సిద్దం అయ్యారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి. తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటన కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version