ఎల్బీనగర్ లో మెట్రో రైలు సేవలను విస్తరిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

-

ఎల్బీనగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వైపు.. మియాపూర్ నుంచి రామచంద్రాపురం వైపు మెట్రో సేవలను పొడగిస్తామని సీఎం తెలిపారు. రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కి సహకరించొద్దని ఓ పెద్దాయన చెప్పారు.  అలా  మరోసారి చేస్తే నగర బహిష్కరణ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

 

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైనటువంటి ఎల్బీనగర్, హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా వాసులు అధికంగా ఉంటారని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వందేళ్ల వరకు హైదరాబాద్ అభివృద్ధి చెందేలా  కృషి చేయనున్నట్టు తెలిపారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version