హైటెక్‌ సిటీ అడ్డాగా ఓ మహిళ గంజాయి విక్రయం

-

హైటెక్‌ సిటీ అడ్డాగా ఓ మహిళ మత్తు దందా సాగిస్తోంది. పోలీసులు చేపట్టిన డెకాయ్‌ ఆపరేషన్‌లో నీతూబాయి అనే ఓ మహిళ ఏళ్ల తరబడి మత్తు పదార్థాల విక్రయం సాగిస్తున్నట్లు బహిర్గతమైంది. గతంలో ఆమెపై పీడీ చట్టం ప్రయోగించి ఏడాది పాటు జైళ్లో ఉంచినా.. విడుదలైన అనంతరం మళ్లీ దందా కొనసాగిస్తుండట చూసి అధికారులు షాక్ అయ్యారు.

ఇటీవలే ములుగు ప్రాంతంలో చిక్కిన ఇద్దరు గంజాయి విక్రేతలను విచారించడంతో వారు నానక్‌రాంగూడ నుంచి ఆ మాల్ తెచ్చామని సిద్దిపేట కమిషనరేట్‌ పోలీసులకు వెల్లడించారు. సిద్దిపేట కమిషనర్‌ అనురాధ ఇటీవల ఒక బృందాన్ని నానక్‌రాంగూడకు పంపించగా.. అక్కడ గంజాయి కొనేందుకు పదిహేను మంది వరకు క్యూలో నిలబడి ఉండడం కనిపించి షాక్ అయ్యారు. అనంతరం పక్కా ప్రణాళికతో ఆమె ఇంటికి వెళ్లికి నీతూబాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెతో పాటు అక్కడున్న వారిని అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో భారీగా గంజాయితోపాటు రూ.16లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version