BREAKING : కృష్ణ అంతిమ యాత్రలో ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్‌

-

BREAKING : కృష్ణ అంతిమ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల లాఠీచార్జ్‌ కి కూడా దిగారు. మరి కాసేపట్లోనే పద్మాలయ స్టూడియోనుంచి కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్య క్రియలు జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. పద్మాలయ స్టూడియో ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసింది. అంతేకాదు, పద్మాలయ స్టూడియో దగ్గర అభిమానుల తోపులాట కూడా చోటు చేసుకుంది. బారికేడ్లు తోసుకుని ఒక్క సారిగా లోనికి అభిమానులు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు.. పద్మాలయ స్టూడియో దగ్గర లాఠీ చార్జ్‌ చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version