ఫ్యాన్ ముక్కలై డస్ట్ బిన్ లోకి పోవడం ఖాయం : చంద్రబాబు

-

ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. “నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్. బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ నా పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ డీఎన్ఏలోనే బీసీ ఉంది. మాది పేదల పక్షం.. మీతోనే ఉంటాం. వైసీపీలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు.

అది భూస్వాములు, పెత్తందారుల పార్టీ. వైసీపీ హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తాం. రాయలసీమ ద్రోహి జగన్ కి ఒక్క ఓటు కూడా వేయవద్దు. ఆయనకు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్. అన్ని వర్గాల పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ టీడీపీ. వెనుకబడిన వర్గాలకు రూ.1.5 లక్షల కోట్లతో సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం. చట్టపరంగా కులగణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం.. నిధులు ఖర్చు చేస్తాం. కురబలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తాం. ఎమ్మిగనూరుకు టెక్స్ టైల్ పార్కు తీసుకువస్తాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version