పెళ్లిలో గుర్రంపై కూర్చుని కుప్పకూలిన వరుడు మృతి

-

గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 25 నుంచి 30 సంవత్సరాల వయసులోపు వారే ఎక్కువగా ఉన్నట్టుండి కుప్పకూలి అకస్మాత్తుగా మరణిస్తున్నారు. కరోనా పీరియడ్ తర్వాతే ఇటువంటి అన్ నేచురల్ డెత్స్ పెరిగినట్లు కొన్ని నివేదికలు స్ఫష్టంచేస్తున్నాయి.

డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, పరిగెత్తుతూ ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇటువంటి ఘటనలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లికొడుకు ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శ్యోపుర్ జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి ఊరేగింపులో భాగంగా డీజే పాటలకు డాన్స్ చేసిన పెళ్లి కొడుకు ప్రదీప్ (26) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు. కాసేపటికే గుండెపోటుకు గురికావడంతో సీపీఆర్ చేసి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version