జర్నలిస్ట్ ల కోసం సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం

-

జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ ని సుప్రీం కోర్ట్ రూపొందించింది. యాప్ ను అధికారికంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఈ యాప్ ను సుప్రీంకోర్టు అందుబాటులోకి తీసుకొచ్చింది. జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ ల కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి వివరించారు.

కేవలం మూడు రోజుల వ్యవధిలోనే యాప్ ని సుప్రీంకోర్టు సాంకేతిక బృందం రూపొందించింది. సుప్రీంకోర్టు రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే… జర్నలిస్టులు రిపోర్ట్ చేసేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్న జస్టిస్ రమణ… కోర్టులో జరిగే కార్యకలాపాలు.. పారదర్శకంగా ఉండేదుకు గాను సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు వివరించారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది కి సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version