మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు షెడ్యూల్ ఇదే..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రేపటితో ఈ యాత్ర 9వ రోజుకు చేరనుంది.ఇక ఈ బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఇవాళ రిలీజ్ చేశారు. యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసి, అక్కడి నుండి బయలుదేరుతారు.

కొవ్వూరు క్రాస్ , సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకున్న తర్వాత భోజన చేసి విరామం తీసుకుంటారు. కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొంటారు.ఇక సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు.ఇప్పటికే వైసీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్‌ 9వ రోజు యాత్ర కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version