తెలంగాణలో విషాదం : సెల్ఫీ సరదాకు ముగ్గురు బాలికల బలి

-

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మల్‌ జిల్లాలోని తానూర్‌ మండలం సింగన్‌ గావ్‌ చెరువులో దురదృష్టవశాత్తు పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను వెలికితీశారు. మృతులు సునీత, వైశాలి, అంజలిగా గుర్తించారు పోలీసులు. అసలు వివరాల్లోకి వెళితే.. చనిపోయిన ముగ్గురు బాలికలు ఆదివారం మధ్యాహ్నం చేనుకు వెళ్లారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైశాలి, అస్మిత వాళ్ల తల్లి మంగళబాయి ముగ్గురినీ ఇంటికి వెళ్లిపోమ్మని పేర్కొంది. దీంతో ఇంటికి బయలు దేరారు ఆ బాలికలు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు బాలికలు దారిలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి గట్టు మీద సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version