UNION CABINET : మోడీ కేబినెట్‌ నుంచి ముగ్గురు కీలక మంత్రులు ఔట్

-

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తీవ్ర ఉత్కంఠతను రేపుతోంది. అందరూ అనుకున్నట్లుగానే కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రి పదవులకు సంతోష్‌ గాంగ్వర్‌, రమేశ్‌ ఫోక్రియాల్‌ తో సహా సదానంద గౌడ్‌ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో మంత్రి వదవికి రమేష్‌ ఫోఖ్రియాల్‌ రాజీనామా చేశారు.

అటు కేబినెట్‌ విస్తరణ, మార్పులు, చేర్పుల్లో భాగంగా సంతోష్‌ గాంగ్వార్‌, సదానంద గౌడ్‌ లు రాజీనామా చేశారు. ఈ సారి కేబినేట్‌ విస్తరణలో సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డికి.. కేబినేట్‌ హోదా ఇస్తారని ఢిల్లీలో ప్రచారం సాగుతోంది. కిషన్‌ రెడ్డికి కేబినేట్‌ హోదా ఇస్తే శాఖ మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనురాగ్‌ ఠాగూర్‌కు స్వతంత్ర హోదాతో మంత్రి పదవి దక్కే ఛాన్స్‌ ఉంది.కాగా.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version