చిరు వ్యాపారులకు గుడ్‌ న్యూస్‌ : నేడు జగనన్న తోడు నిధులు విడుదల

-

చిరు వ్యాపారులకు ఏపీ సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. జగనన్న తోడు పథకంలో భాగంగా… లబ్ది దారుల ఖతాల్లో రూ. రూ.84.80 లక్షలు జమ చేశారు సీఎం జగన్‌. ఇక పథకం ద్వారా ఏకంగా 31,649 మంది చిరు వ్యాపారలు లబ్ది పొందనున్నారు.

cm jagan

చిరు వ్యాపారుల కష్టాలను పాదయాత్రలో తెలుసుకున్నానని… అందుకే చిరు వ్యాపారుల కోసం జగన్న తోడు పథకాన్ని ప్రారంభించామని గతంలోనే వెల్లడించారు సీఎం జగన్‌. చిరు వ్యాపారులకు అండగా జగనన్న తోడు పథకం ఉంటుందని.. చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి ఎప్పుడూ సహకారం అందలేదన్నారు. గత ప్రభుత్వాలు కూడా చిరు వ్యాపారులను పట్టించుకోలేదని చెప్పారు సీఎం జగన్‌. కాగా నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 వడ్డీలేని రుణం అందించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version