Tollywood: లేడీ రైటర్‌ నవలలు కాపి కొడుతున్నా త్రివిక్రమ్ ?

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మహేష్ బాబు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.ఈ సినిమా మరో అజ్ఞాతవాసిగా ఉందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే త్రివిక్రమ్ నుంచి వచ్చే కథలు, డైలాగులు అద్భుతంగా ఉంటాయి. మన్మథుడు, ‘మల్లీశ్వరి,నువ్వు నాకు నచ్చావ్’, ‘చిరునవ్వుతో’, వంటి హిట్ సినిమాలకు కథలు అందించి గొప్ప రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు.తర్వాత దర్శకుడిగా మారి ‘నువ్వే నువ్వే’, ‘అతడు’, ‘జల్సా’, ‘ఖలేజా’ వంటి సూపర్ హిట్స్ వంటి చిత్రాలను తీశాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ గురించి ఒక విషయం వైరల్ అవుతుంది. ప్రముఖ తెలుగు రచయిత యద్దనపూడి సులోచన రాణి రాసిన నవలల నుంచి త్రివిక్రమ్ కాపీ కొట్టి ,ఆమె రాసిన నవలలోని కథలు కాస్త తన స్టైల్ లో మార్చి వాటిని సినిమాలుగా తీసి త్రివిక్రమ్ హిట్స్ కొడుతున్నాడని పలువురు తీవ్ర ఆరోపణలు చేశారు.ఇప్పుడు ఆమె చనిపోవడంతో ఆమె నుంచి ఎలాంటి నవలలు రాకపోవడం వల్ల సరైన సినిమాలు తీయలేకపోతున్నాడని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version