టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. మరో సారి విచారణకు సెలబ్రిటీలు !

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కొత్త చోటు చేసుకుంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ తో ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చారు. ఈడి అడిగిన అన్ని వివరాలను ఎక్సైజ్ శాఖ ఇచ్చేసింది. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా, ఎఫ్ ఎస్ ఎల్ నివేదికలు ఈడికి అందజేశారు ప్రభుత్వ అధికారులు, ఏడికి వివరాలు అందజేసినట్లు ప్రభుత్వం హైకోర్టులో మెమో కూడా దాఖలు చేసింది.

దీంతో సి ఎస్ అలాగే ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పై హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. ఇక మళ్లీ టాలీవుడ్లో కేసులో ఈడీ దూకుడు పెంచనుంది. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా పరిశీలించనుంది. మరోసారి సినీ తారలను ఈడి అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోలు అలాగే మనీలాండరింగ్ పై కూపీ లాగుతున్నారు అధికారులు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు ఈడి అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version