Big News : రేపు అమిత్‌షా రాక.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభను, రేపు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తుండడంతో ఈ భారీ బహిరంగ సభకు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు.

రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు తుక్కుగూడ వచ్చే దారులు బీజేపీ బహిరంగ సభ కారణంగా అధిక రద్దీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. దీంతో.. ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చంద్రాయనగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు ప్రత్యమ్నాయ మార్గలు ఎంచుకోవాలి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version