TSRTC: హైదరాబాద్ లో రెండు ఆర్టీసీ బస్సులు దగ్దం..

-

ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ బస్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ అగ్నిప్రమాదంలో రెండు బస్సులకు నిప్పు అంటుకొని పూర్తిగా కాలిపోగా , మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైందని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రెండు బస్సులకు నిప్పు అంటుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఒక్కసారిగా రెండు బస్సులకు నిప్పు అంటుకోవడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.అగ్ని ప్రమాదము జరిగే సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి.అగ్నిమాపక సిబ్బంది డిపో కి వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది అని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version