టీటీడీ సంచలన నిర్ణయం.. ఆ అర్చకులు మళ్ళీ విధుల్లోకి !

-

టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్ అయిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులను కూడా విధుల్లో చేరాలని టిటిడి ఆదేశాలు జారీ చేసింది. 3818/2018 హైకోర్టు తీర్పు మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రధాన అర్చకుడు హోదాలో ఆలయ ప్రవేశం చేయనున్నారు రమణ దీక్షితులు.

ttd

అయితే ఆయన ఎంట్రీతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధానార్చకులు కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది అని చెబుతున్నారు.నిజానికి చంద్రబాబు హయాంలో అర్చకులకు, ప్రధానార్చకులు కూడా వయోపరిమితి విధిస్తూ ఆ పరిమితి దాటాక రిటైర్ అయ్యే లాగా రూల్స్ తీసుకువచ్చారు. అయితే హైకోర్టు కు వెళ్ళిన అర్చకులు అందుకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోగలిగారు. జగన్ అధికారంలోకి వచ్చాక రమణదీక్షితులు లకు సలహాదారు పదవి అప్పగించారు.. తాజా ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకులు హోదాలో పని చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version