దొంగతానికి వచ్చి కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి..`

-

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలు అనుకోకుండా కరెంట్ షాక్ బారిన పడి మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో గ్రామంలో బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే, గత కొంత కాలంగా బోయినపల్లి గ్రామంలోని సోలాల్ ప్లాంటో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే సోలార్ ప్లాంట్ నిర్వాహకులు దొంతతనాలను అరికట్టే క్రమంలో చుట్టూ విద్యుత్ కంచెలను ఏర్పాటు చేశారు. అయితే, దొంగలు చాకచక్యంగా మొదటి కంచెను విజయవంతంగా కట్ చేసి రెండో కంచెను ధ్వంసం చేసే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, వారి మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version