Urmila Matondkar: చిత్ర సీమలో క‌రోనా క‌ల‌కలం.. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ క‌రోనా పాజిటివ్..

-

Urmila Matondkar: దేశంలో త‌గ్గుముఖం ప‌డుతుండ‌నే క్ర‌మంలో మళ్ళీ కరోనా విజృంభించే సూచనలు కన్పిస్తున్నాయి. కరోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలోనూ మళ్ళీ కరోనా కలకలం ప్రారంభ‌మైంది. ఇటీవలే ‘అఖండ’ మూవీ యూనిట్ లో క‌రోనా క‌ల‌క‌లం రేగిన విష‌యం తెలిసిందే. ఆ చిత్ర హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కరోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా తనకు కరోనా బారిన ప‌డిన‌ట్టు తెలిసింది.

తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి, రాజకీయ నేత ఊర్మిళ మాటోండ్కర్ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె త‌న ట్విటర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ‘‘నాకు కొవిడ్‌ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్ర‌స్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. గ‌త వారం రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న‌ వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. ప్రియమైన వారందరినీ ప్రేమగా చూసూకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోండి’’అని ట్వీటారు ఊర్మిళ.

రంగీలా, గయాన్, సత్య అండ్ కంపెనీ, కమల్ హాసన్ ‘భారతీయుడు’ మొదలైన చిత్రాల్లో నటించింది ఉర్మిళా. 2016లో తన ప్రియుడు మొహసిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుని చిత్ర సీమ దూరంగా ఉంది. అనంత‌రం ఊర్మిళ రాజకీయ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె మొదట కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఇక తాజాగా కాంగ్రెస్ నుండి పార్టీ మారి.. మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేనలో చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version