డీజీపీకి లేఖరాసిన వాసిరెడ్డి పద్మ… మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ !

-

రెండు రోజుల క్రితం ఏపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా పై అసభ్యమైన పదజాలంతో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ పై రోజా చేసిన వ్యాఖ్యలకు రిప్లై గా బండారు సత్యనారాయణ దారుణంగా రోజాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ విషయంపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డికి లేఖ రాయం జరిగింది. ఈమె ఈ లేఖలో రోజా పై చేసిన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని, ప్రస్తుతం సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని ఇలా బండారు సత్యనారాయణ మాట్లాడారో అర్ధం కావడం లేదు.. తక్షణమే ఇతనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది.

ఇక బండారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి.. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటేనే మరొకరు ఈ స్థాయిలోకి మాట్లాడడానికి భయపడతారు అంటూ మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version