స్నేహితుడితో క్లబ్‌కు వెళితే.. వాష్‌రూంలో కెమెరా పెట్టి వీడియో..

-

జోధ్‌పూర్‌లోని ప్రముఖ క్లబ్ లోని వాష్‌రూంలో ఓ వ్యక్తి రహస్యంగా కెమెరా పెట్టి తనను చిత్రీకరించాడని ఓ మైనర్‌ బాలిక రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన ఉదంతం సంచలనం రేపింది. ఉమెద్ క్లబ్ లో వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు తనను ఓ వ్యక్తి సీక్రెట్ గా వీడియో తీశాడని… దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా… ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ మైనర్ బాలిక హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బాలిక డిమాండ్ చేసింది. ఏప్రిల్ 24వ తేదీన బాధిత బాలిక తన స్నేహితుడితో కలిసి క్లబ్ వెళ్ళింది.

ఈత కొట్టిన తర్వాత వాష్ రూమ్ లో దుస్తులు మార్చుకుంటుండగా గోడకు అవతలి వైపు నుంచి ఎవరో రహస్యంగా వీడియో చిత్రీకరించడాన్ని బాలిక గమనించి అరుపులు, కేకలు పెట్టింది. వీడియో తీసిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా క్లబ్ లో వ్యక్తులు పట్టుకున్నారు. ఆ తరువాత బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు క్లబ్ కు వచ్చారు. అయితే, క్లబ్బు ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉన్నందున పోలీసులను తిరిగి వెళ్ళమని క్లబ్ ఆఫీస్ బేరర్లు కోరారు. వీడియో చిత్రీకరణ విషయాన్ని తాము క్లబ్లో అంతర్గతంగా సమస్యను పరిష్కరించుకుంటామని క్లబ్ నిర్వాహకులు తెలిపారు.

అయితే ఘటన జరిగి రోజులు గడుస్తున్నా వీడియో తీసిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిందితుడికి అనుకూలంగా ఉన్నారని బాధిత బాలిక తల్లి క్లబ్ ప్రెసిడెంట్, ముగ్గురు సభ్యులు, వీడియో తీసిన నిందితుడిపై ఉదయ్ మందిర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది విపుల్ సింఘ్వి తెలిపారు. రాజీకి అంగీకరించమని బాధితురాలిని బలవంతం చేశారని… విచారణ పూర్తయ్యేవరకు ఫోన్ క్లబ్‌లోనే ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ నిందితుడికి మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేశారని విపుల్ సింఘ్వి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version