విజయ్ దేవరకొండ టెన్షన్ మామూలుగా లేదట.!

-

లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ఈ సినిమాకు పూరీ కంటే విజయ్ ఎక్కువ కష్టపడ్డాడు. తన మేక్ ఓవర్ గాని , సినిమా ప్రమోషన్ ను తన భుజాల మీద వేసుకొని కష్టపడ్డాడు. తన సినిమా ను పాన్ ఇండియా సినిమా గా ప్రమోట్ చేశాడు. కాని వారి ఆశలు తలకిందులు అయ్యి సినిమా ప్లాప్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ మళ్లీ హోటల్ లో కూర్చొని కథలు రాసుకుంటున్నాడు.

విజయ్, సమంత తో ఖుషి సినిమా చేస్తున్నాడు.నిజానికి ‘ఖుషి’ చిత్రాన్ని  2022 క్రిస్మస్ రిలీజ్ అనుకొని సాధ్యం కాదని  2023 వాలెంటైన్స్ డే స్పెషల్ గా  రావాలని చూశారు.కాని సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఇది కూడా సాధ్యం అయ్యేలా లేదు. ఇప్పుడు  2023 సమ్మర్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తాజాగా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని కథలు వింటున్నాడు. కాని ఎప్పుడైనా ఒక సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఎక్కువ మంది హీరోలు రెండో సినిమా లైన్ లో ఉంచు కుంటారు.కాని ప్రస్తుతం తర్వాత సినిమా పై క్లారిటీ లేకుండా పోయింది. అదే లైగెర్ హిట్ అయి వుంటే మనోడు పూర్తిగా బాలీవుడ్ కు అంకితం అయి ఉండేవాడు. ఇప్పుడు తెలుగు లో పెద్ద దర్శకులు కూడా ఎవరూ ఖాళీగా లేరు. ప్రస్తుతం విజయ్ తొందరగా ఒక ప్రాజెక్టు ను లైన్ లో పెట్టాలని తెగ తాపత్రయ పడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version