తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం

-

తారకరత్న మరణాన్ని ఆయన కుటుంబసభ్యులు.. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు నటుడిగా కొనసాగుతూనే.. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్న తమ అభిమాన హీరో ఇకలేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే, తారకరత్న మృతిపై.. బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తమదే అంటూ బాలకృష్ణ మాటిచ్చాడని… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నందమూరి తారకరత్న అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

తారకరత్న చాలా మంచి వ్యక్తి అని, సినీ రంగంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని తెలిపారు. తారకరత్న అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని వివరించారు. తారకరత్న భార్య అలేఖ్య మానసిక ఒత్తిడికి గురైందని అన్నారు. తారకరత్న మరణాన్ని అలేఖ్య జీర్ణించుకోలేకపోతోందని విజయసాయి వెల్లడించారు. తారకరత్న మరణం కుటుంబ సభ్యులను, అభిమానులను ఎంతో బాధించింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే తారకరత్న మరణించడం విచారించదగ్గ విషయం. రాజకీయాల్లో ప్రవేశించాలని తారకరత్న భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version