సీఎం కేసీఆర్ ది రాక్షస ప్రభుత్వం – విజయశాంతి

-

కేసీఆర్ సర్కారంటే రైతుల ప్రాణాలు తీసే రాక్షస ప్రభుత్వం అని మరోసారి రుజువైందని ఫైర్ అయ్యారు విజయశాంతి. ప్రభుత్వ యంత్రాంగం దారుణ నిర్లక్ష్యం వల్ల కామారెడ్డి జిల్లా మెంగారం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు తన పిల్లలు చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నడన్నారు.

 

ఈ గ్రామంలో చెరువు కింది భాగంలో ఉన్న ఆంజనేయులు పొలం మీదుగా నిత్యం నీరు ప్రవహిస్తుండటంతో తనకు న్యాయం చెయ్యాలని, పరిహారం ఇప్పించాలని ఏళ్లకేళ్లు అధికారులను వేడుకుంటూనే ఉన్నడు. ఆంజనేయులు మొరను అధికారులు పట్టించుకోకపోవడంతో సెల్ టవర్ ఎక్కి తన పిల్లలు చూస్తుండగానే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడనిమండిపడ్డారు.

 

ఇదీ తెలంగాణ రైతుకు పట్టిన గతి. ఒక అన్నదాత బలవన్మరణం పాలయ్యేలా చేసి అతని పిల్లల్ని అనాథల్ని చేసిన ఈ కేసీఆర్ సర్కార్ పాపం పండింది. ఈ ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కేసీఆర్ గారి సర్కారు తప్పులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రజా తీర్పు ఎన్నడైనా తప్పని పరిణామమే ఎంతటి నియంతకైనా… అంటూ నిప్పులు చెరిగారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version