థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ !

-

30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న డైలాగ్ తో కమెడియన్ పృథ్వి ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో వరుసపెట్టి సినిమాలో అవకాశాలు రావడంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన పృథ్వి ఒక టైమ్ లో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు. అదే టైంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. వైసీపీ పార్టీ తరఫున వైఎస్ జగన్ చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రలో పార్టీకి తోడుగా మరియు జగన్ కీ మద్దతుగా ఉంటూ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు.ఎన్నికల టైంలో వైసీపీ పార్టీ తరఫున చాలాచోట్ల ప్రచారం చేసిన పృద్విరాజ్ కి అధికారంలోకి వచ్చాక వైయస్ జగన్ టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వెంకటేశ్వర భక్తి ఛానల్ కి చైర్మన్ పదవి అప్ప చెప్పడం జరిగింది. దీంతో కాలం కలిసి రాక అదే సంస్థలో పని చేస్తున్న ఒక అమ్మాయి తో అసభ్యంగా ఫోన్లో మాట్లాడటంతో ఆడియో టైప్ బయటకు రావడంతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పరువు పోయింది. దీంతో వెంటనే తన చైర్మన్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.

 

చాలాకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇటీవల బయటకు వచ్చిన ఆయన పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తనని తన చుట్టూ వాళ్లే ఇరికించారు అసలు ఈ ఆడియో టేప్ నాది కాదు అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నానని ఒక ప్రముఖ అతిపెద్ద హీరో తనని ఆదుకున్నారని చెప్పుకొచ్చిన పృద్వి, తాజాగా ఇండస్ట్రీలో ఉన్న వార్త ఏమిటంటే ఆ హీరో కూడా పృద్వి నీ పక్కన పెట్టేసినట్లు ఇండస్ట్రీ నుండి ఏ ఒక్క అవకాశం రావట్లేదు అన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version