అఫీషియల్: ‘విరాట పర్వం’ అప్‌డేట్..రిలీజ్ అయ్యేది అప్పుడే..

-

వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాట పర్వం’ సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి వలన చాలా ఇబ్బంది పడ్డ సినిమాల్లో ఒకటి ఇది. కాగా, ఈ సినిమా డైరెక్ట్ గా OTT లోనే రిలీజ్ అవుతుందని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి.

ఆ వార్తలన్నిటికీ తాజాగా చెక్ పెట్టారు మేకర్స్ . ఈ పిక్చర్ ను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నామనేది శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ పిక్చర్ లో సాయి పల్లవి, దగ్గుబాటి రానా, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. తెలంగాణలోని నక్సలైట్ మూమెంట్ నేపథ్యాన్ని ఎంచుకుని చాలా చక్కటి ఎమోషన్స్ తో సినిమా వచ్చిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version