శంకరాభరణం విడుదలైన రోజే శివైక్యం చెందిన కె.విశ్వనాథ్

-

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం అలుముకుంది.

కె.విశ్వనాథ్‌ అపురూప చిత్రాల్లో ‘శంకరాభరణం’కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. సంగీత ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియర్‌ హంగులు లేకున్నా అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానంతరమే కె.విశ్వనాథ్‌ కళాతపస్విగా పేరుపొందారు. అయితే శంకరాభరణం విడుదలైన రోజే ఆయన శివైక్యం చేయడం బాధాకరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version