వీఆర్వో మృతి

-

మనస్తాపంతో పురుగుల మందు సేవించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కోదాడలో శుక్రవారం చోటుచేసుకుంది. సిఐ నర్సింహరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన కలకొండ నరేష్(27) HZNRలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 2న నరేష్ విధులకు వెళ్లిన సమయంలో ఆయన భార్య ఆమె తల్లితో కలిసి పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version