బండి సంజయ్‌ పై రఘునందన్‌ రావు ఫైర్‌..నన్ను అవమానిస్తున్నారు !

-

తెలంగాణ రాష్ట్రంలో.. ఇప్పుడిప్పుడే.. భారతీయ జనతా పార్టీ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో.. ఆ పార్టీలోని కీలక లీడర్ల మధ్య అంతర్యుద్ధం నెలకొంది. తాజాగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనను అవమానిస్తున్నారని తాజాగా రఘునందన్‌ రావు అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్ర పదాధికారుల సమావేశ వేదికపైకి తననను ఎందుకు పిలవలేదని నిప్పులు చెరిగారని సమాచారం అందుతోంది.

బండి సంజయ్‌ మొదటి విడత పాదయాత్ర ప్రారంభ సమయంలో.. అలాగే..చివరి రోజున హుస్నాబాద్‌ సభలో తనకు మాట్లాడే అవకాశం రాలేదని అంసతృప్తితో రఘునందన్‌ రావు ఉన్నారని పార్టీలో కొంత మంది లీడర్లు చెబుతున్నారు. ఎంపీలు గెలిచారా… ఎమ్మెల్యేలం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డామని.. ముక్త కంఠంతో.. రాష్ట్ర వర్గంపై ఆగ్రహంగా ఉన్నారట రఘునందన్‌. పార్టీ పదవులను భర్తీ చేయాలని కూడాడిమాండ్‌ చేస్తున్నారట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version