ఎక్కడికి వెళుతోంది సమాజం: రంగారెడ్డి జిల్లాలో ఘోరమైన పరువు హత్య !

-

ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక మూలాన పరువు హత్యలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆలస్యం అయినా వెలుగులోకి వస్తుంటాయి. మరికొన్ని అలాగే మరణపు గుంతల్లో సమాధి చేయబడి ఉంటాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలో పరువు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది ఒక రాక్షస కుటుంబం. పూర్తి వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెళ్లి గ్రామంలో కరణ్ అనే యువకుడు వరుసకు చెల్లి అవుతుందని తెలిసినా ప్రేమలో పది మునిగిపోవడంతో అవేమీ పట్టించుకోకుండా మనసులు కలిస్తే చాలు అని భావించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తండ్రి మరియు బంధువులు తీవ్ర ఆగ్రహంతో కిరణ్ ను నిర్దాక్షిణ్యంగా చంపేసి పొలంలో పూడ్చి పెట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కరణ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయాలు అన్నీ బయటకు వచ్చాయి.

ప్రస్తుతం పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు. కనబడని పరువుకు ఒక నిండు ప్రాణాన్ని బలితీయడమా .. ఎక్కడికి వెళుతోంది మానసమాజం అంటూ ప్రజలు గగ్గోలు పెడుహున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version