తాగుబోతు భర్త మార్మంగాన్ని కోసి హత్య చేసిన భార్య

-

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో దారుణం జరిగింది. భర్త పెట్టే బాధలు భరించలేక ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది. అనుమానంతో నిత్యం భర్త తనను చిత్రహింసలు పెడుతుండడంతో ఆ భార్య అతడి తలపై రాయితో బాది, మర్మాంగాన్ని కత్తితో కోసి హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. శాహువాడీలోని లోలనే గ్రామానికి చెందిన ప్రకాష్ పాండురంగ కాంట్లే(52), వందన (50) దంపతులు కొద్ది నెలలుగా మంగుర్వాడి లోని ఓ వ్యవసాయ క్షేత్రం లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వందనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రకాష్ నిత్యం తాగి వచ్చి ఆమెను కొడుతూ ఉండేవాడు.

 

రోజురోజుకు ఈ వేధింపులు అధికం అవుతున్నాయి తప్ప ఆగడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన వందన పక్కనే ఉన్న రాయిని తీసుకుని భర్త తలపై బాదింది. అనంతరం కత్తితో భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీంతో అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి వందనను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version