పరాయి మహిళలపై భర్త మోజు.. కోపంతో అతడిపై వేడి నూనె పోసిన భార్య

-

పరాయి ఆడవాళ్ల వ్యామోహంలో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని కోపోద్రిక్తురాలైన ఓ భార్య అతడిపై వేడివేడి నూనె పోసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పిల్లల చదువుకోసమని విజయవాడ నుంచి నగరానికి వచ్చిన గిరిధర్ లాల్, రేణుక దంపతులు కుమార్తె, ఇద్దరు కొడుకులతో దరియాబాగ్‌లో ఉంటున్నారు. కొన్నేళ్లుగా గిరిధర్ ఇతర మహిళలపై వ్యామోహంలో పడి భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. ఐదు నెలలుగా ఓ మహిళ వద్ద ఉంటూ మూడ్రోజుల క్రితం తన వద్దకు వచ్చిన భర్తపై రేణుక కోపోద్రిక్తురాలైంది. ఈ విషయంపైనే ఇరువురు తరచూ గొడవపడేవారు.

మంగళవారం రోజు కూడా గొడవ జరిగింది. ఈ గొడవలో భర్త ప్రవర్తనతో విసిగిపోయిన రేణుక వంటింట్లో కడాయిలో ఉన్న వేడి నూనెను గిరిధర్ తలపై పోసింది. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రేణుకను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version