నుమాయిష్‌లో నేడు మహిళా దినోత్సవం.. పురుషులకు నో ఎంట్రీ

-

హైదరాబాద్‌లో ప్రతి ఏటా నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ మైదానంలో జరిగే నుమాయిష్ ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఎగ్జిబిషన్‌కు నగరవ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. ప్రతిరోజు సందర్శకులతో నాంపల్లి మైదానం కిక్కిరిసిపోతోంది. ఇక వారాంతాల్లో అయితే మామూలు సందడి ఉండటం లేదు.

నుమాయిష్‌లో ఇవాళ ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఇవాళ నుమాయిష్‌లో మహిళా దినోత్సవం జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నుమాయిష్‌కు కేవలం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం మాదిరిగానే 46 రోజుల్లో ఒక రోజు మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌వేశం క‌ల్పించ‌నున్న‌ట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ ఉపాధ్య‌క్షుడు ఆశ్విన్ మార్గం తెలిపారు.

మ‌హిళ‌ల‌తో పాటు 18 ఏండ్ల లోపు అబ్బాయిల‌కు అనుమ‌తి ఉంటుంది. ఇక ఎగ్జిబిష‌న్‌లో ఇవాళ ప్ర‌త్యేక సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. సాధార‌ణ టికెట్ రూ. 40తోనే మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version