ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో కళ్లన్నీ ఆఫ్గనిస్తాన్ పైనే, స్పిన్నర్లు చెలరేగితే చాలు !

-

ఈ రోజు ముంబై వేదికగా ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్యన కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ కు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆసీస్ గెలిస్తే నేరుగా సెమీస్ కు వెళుతుంది, ఒకవేళ ఆఫ్గనిస్తాన్ కనుక గెలిస్తే సెమీస్ కు మరింత దగ్గర అవుతుంది. ఈ మ్యాచ్ గురించి ఆలోచిస్తే ఎవరు గెలవనున్నారు అన్నది చాలా ఈజీ గా చెప్పగలరు. అయితే ఏ జట్టునూ కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేకుండా ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఆస్ట్రేలియా కు ఉంది. ఇక ఈ మ్యాచ్ లో చాలా వరకు ప్రేక్షకుల కన్ను ఆఫ్గనిస్తాన్ మీదనే ఉంది. ఎందుకంటే.. వరల్డ్ కప్ చరిత్రలో సెమీస్ కు ఇప్పటి వరకు ఆఫ్ఘన్ చేరింది లేదు. ఈ జట్టులో ముజీబ్, నబి, రషీద్ ఖాన్ లతో చాలా బలంగా ఉంది.

వీరు ముగ్గురు లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయగలిగితే ఆస్ట్రేలియా ను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కనీసం ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ గెలవకున్నా ? గట్టి పోటీ ఇవ్వగలిగిన చాలు అని అభిమానులు ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version