వింత స్టేషన్.. సంవత్సరానికి కేవలం 2 రైళ్లు మాత్రమే!

-

నార్మల్‌గా ఏదైనా రైల్వే స్టేషన్  అంటే వేల సంఖ్యలో ప్రయాణికులు, కంటిన్యూస్‌గా వినిపించే ట్రైన్ హారన్లతో ఎంతో బిజీ గా ఉంటుంది కదా! కానీ మన దేశంలోనే ఒక వింత రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి ఏడాది మొత్తం మీద కేవలం రెండు సార్లు మాత్రమే ట్రైన్ వస్తుంది. వినడానికి సప్రైజ్ గా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పంజాబ్‌లోని ఈ ‘హుస్సేనీవాలా’ రైల్వే స్టేషన్ గురించి ఒక వ్లోగర్ వీడియో పోస్ట్ చేయడంతో ఇప్పుడు నెట్టింట ఇది తెగ వైరల్ అవుతోంది. ఈ మిస్టరీ స్టేషన్ వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కడుంది ఈ వింత రైల్వే స్టేషన్?: ఈ అరుదైన రైల్వే స్టేషన్ పంజాబ్ స్టేట్‌లోని ఫిరోజ్పూర్హుస్సేనీవాలా బోర్డర్ ఏరియాలో ఉంది. ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉండే ఈ రైల్వే రూట్‌లో ఇదే లాస్ట్ స్టేషన్ . దేశ విభజనకు ముందు ఈ మార్గం చాలా హెవీ ట్రాఫిక్ తో ఉండేది, కానీ కాలక్రమేణా ఇది తన ప్రాధాన్యత కోల్పోయింది. ప్రస్తుతం ఈ ట్రాక్ మీద రెగ్యులర్ గా ట్రైన్స్ నడవవు. అందుకే ఇది దేశంలోనే అత్యంత అరుదైన మరియు వింతైన స్టేషన్‌గా రికార్డు సృష్టించింది.

World’s Strangest Railway Station: Only 2 Trains a Year!
World’s Strangest Railway Station: Only 2 Trains a Year!

ఏడాదికి ఆ రెండు రోజులే ఎందుకు?:ఈ స్టేషన్‌కు ఏడాదిలో కేవలం రెండు స్పెషల్ రోజులు లో మాత్రమే ట్రైన్ వస్తుంది. మొదటిది మార్చి 23వ తేదీన. మన దేశ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ అమరుడైన రోజు కావడంతో, ఆయనకు నివాళులు అర్పించేందుకు వేల సంఖ్యలో విజిటర్స్ ఇక్కడికి వస్తారు. రెండవది ఏప్రిల్ 13న జరుపుకునే బైసాకి ఫెస్టివల్ . ఈ రెండు రోజుల్లో మాత్రమే ఫిరోజ్‌పుర్ నుండి స్పెషల్ ట్రైన్స్ ఇక్కడికి నడుస్తాయి. ఆ టైమ్ లో మాత్రమే ఈ స్టేషన్ ప్రయాణికులతో రద్దీ గా కనిపిస్తుంది.

మిగిలిన రోజుల్లో ఈ స్టేషన్ పరిస్థితి ఏంటి?: మిగిలిన 363 రోజులు ఈ రైల్వే స్టేషన్ కంప్లీట్‌గా సైలెంట్ గా ఉంటుంది. పట్టాల మీద రైళ్లు తిరగవు కాబట్టి, లోకల్స్ ఈ రైల్వే ట్రాక్‌ను ఒక రోడ్ లాగా ఉపయోగిస్తున్నారు. సైకిళ్లు, బైకులు మరియు చిన్న చిన్న వాహనాలు ఈ ట్రాక్ మీద నుండే వెళ్తుంటాయి. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద ఆవులు, మేకలు విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఇక్కడ రైల్వే ట్రాక్ ఒక షార్ట్కట్ రూట్ గా మారిపోయింది.

దీని చారిత్రక ప్రాధాన్యత: హుస్సేనీవాలా స్టేషన్ కేవలం ఒక వింత స్టేషన్ మాత్రమే కాదు, దీనికి గొప్ప హిస్టరీ ఉంది. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి వీరుల అంత్యక్రియలు జరిగిన ప్రదేశం దీనికి చాలా దగ్గరలోనే ఉంది. అందుకే ఈ ప్రాంతం భారతీయులకు ఒక ఎమోషనల్ మరియు పవిత్రమైన చోటు. ఈ సరిహద్దు ప్రాంతంలో ప్రతిరోజూ సాయంత్రం జరిగే రిట్రీట్ ని చూసేందుకు కూడా ప్రజలు చాలా ఇంటరెస్ట్ చూపిస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news