పావురాల గుట్టలో YSR కు పట్టిన గతే జగన్ కు పడుతుంది – యరపతినేని

-

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అలిపిరిలో చంద్రబాబు మీద బాంబు దాడి జరిగితే 20 అడుగులు కారు పై కిలేచి కిందపడితే బతికారు అది ఆయన చేసిన మంచితనం అన్నారు. మీ రాజశేఖర్ రెడ్డి పావురాళ్లు గుట్టలో ఏ పరిస్థితి ఏర్పడిందో నీకు అదేగతి పట్టిది గుర్తుపెట్టుకో జగన్ అంటూ సవాల్ చేశారు.

 

వైసీపీ పాలనలో మూడునరేళ్లు గురజాల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసకాండ, ఫ్యాక్షన్ హత్యలకు తెరలేపారని ఫైర్ అయ్యారు. ఇసుక, నిత్యవసర సరుకులు, విద్యుత్ చార్జీలు పెంచి, సామాన్యుల నడ్డి విరిచారు..వైసీపి పాలనాలో గురజాల నియోజకవర్గంలో 9 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, కాపు నాయకులను పొట్టన పెట్టుకున్నారన్నారు.

 

బీసీలు ఎన్టీఆర్ వెంట నడిచి కేంద్ర మంత్రులు అయ్యారు. మీరు బీసీలపై దృతరాష్ట్రుడి ప్రేమ చూపిస్తున్నారని, పైకి అంత నీ కులస్తులకు మాత్రమే న్యాయం చేస్తున్నామన్నారు.. ఎన్నికల అప్పుడు ప్రజల వద్దకు వెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని, ఇంకా ఎన్నికలు ఒకటిన్నర సంవత్సరాలు ఉండగానే బీసీ శంఖారావం మొదలు పెట్టామన్నారు యరపతినేని.

Read more RELATED
Recommended to you

Exit mobile version